Search This Blog

Friday, July 6, 2012

All in the Game


All in the Game
It
 was a pleasant morning with a mild southwesterly blowing intermittent cirrus clouds across the course. Hiraki teed up a little high and with a smooth fluid swing sent the ball over the ominous looking water hazard, splitting the fairway into two equal halves.
Goooshaaw, Yamamoto-san” shouted Aggarwal. Hiraki’s tiny chest ballooned with pride. First tee-shot always has portentous significance to early morning golfers. ‘A day well began’ Hiraki was smiling within. It was the day he was planning to meet the government representatives; his inner voice must have told him that the deal would somehow go through. That’s when he saw that immaculately dressed gentleman, colour-coordinated from floppy San Andrews cap to his shining black golf shoes, hurrying towards the tee-box.
“Ah there…! You’re just in time, mister Rao”, exclaimed Aggarwal.

Royal N Ancient … RNA, to his friends – Ramji Narayan Aggarwal is one of the oldest and loudest members of the club – always ready to lend a helping hand to fellow members. I looked up midway through my backswing promptly sending my ball sputtering through the lake. An inaudible curse escaped my lips. Hiraki looked at me with a slight nod acknowledging my distress. “Shigata nai” I muttered before tossing the driver to my caddie.
Aggarwal had not taken any notice, he was eager to introduce Rao to his new found acquaintance, Hiraki. “Yamamoto-san, meet mister Rao, an old friend of mine and a great golfer…” Introductions went on for a while with Hiraki’s characteristic bows in response the verbal flood from Aggarwal extolling his worthy friend.
I began to fidget. My tee-shot had not helped my mood much. “Gentlemen”, I interrupted gesturing at the other four-ball waiting behind us. Aggarwal grunted, conceding, as he moved to the ball already teed up by his caddie – it is too menial a task to bend down and tee up the ball – and a louder grunt followed as he heaved his weight behind the shot making the ball disappear into the trees. Rao’s shot that followed was decent, giving a semblance of competition to Hiraki.
My mood had not improved as I dropped another ball short of the water hazard. Another lousy day! My thoughts went back to the previous day – that began with a quaint plea from my son, who needed my help in getting his passport renewed, rather urgently – and my futile efforts to convince the authorities that the child’s trip to Australia to participate in an architectural design competition is of reasonable national importance.
Pillar to post!
Or is it water hazard to sand trap? I cursed once again as my ball faded right into the greenside bunker. “A double bogey at the best,” I said accompanying Aggarwal ambling lazily towards his caddie that had found the ball which appeared miraculously at the fringe of the fairway.
I had no qualms though – it was I that had asked Aggarwal to fix the game with Rao, explaining the predicament of Hiraki, whose firm is the only supplier of a certain cantilevers, deemed essential by the consultants for the superfast roadway connecting the principal cities of the state. At the request of the consultants, his firm had set up a hundred million dollar manufacturing unit and I was instrumental in locating it.
The project is essential for its future viability.
Everything was hunky dory until Hiraki’s predawn phone-call shook me up on the day before. His voice sounded to my sleepy head like a thousand May-day alarms going off at the same time. “The specs vanished in the final detailing document. It must be the consortium…”
My mind continued to wander adding three more bogeys to the card, as the four-ball continued through to the refreshment hut at the fifth tee – a long holdup, two groups waiting ahead of us. Aggarwal continued in his characteristic tenor forcing wit into his praises of Rao, recounting anecdotes from a long string of his feats. Even Rao couldn’t have made his own resume, more effective.
I smiled absentmindedly at the three heads huddled together and moseyed off with my phone to call a certain Ilangovan that can help me with my son’s passport. “Avaru baathroomla irukaamgu. Pinnaale phonu pamdumgo” a high pitched voice replied without masking her irritation.
The sixth hole is a short par three – just a well aimed pitch with a wedge across the water should get a par, if not a birdie. Hiraki and Aggarwal are already two up. ‘But … this is my favorite hole’ I walked confidently to the tee in spite of a wayward hook by my partner Rao. An easy swing and – Brrrrrrrrr – the phone began to vibrate. I was in two minds – to take a shot or the call – and duffed the ball … another ProV into the depths.
“Sawrree saar. My name ees Ilangovan saar”, he began.
“Yes… yes mister Ilangovan. I was trying to contact you for my son’s …”
Teriyum saar. Don’t worry. Tomorrow passport coming saar, gaarentee. Just small fees for polees and my friend in awffees, saar
“Okay … okay” I hung up, getting ready for my three from the tee box.

“Who’s that?” asked Rao with a smirk.
“Some bloody tout”, I replied, landing the ball next to the pin. An assured bogey, and a chance to halve the hole made me eloquent. “In this goddamned country … the processes are so convoluted, they don’t even exist. You know, how much I had to run around to get a simple passport renewed?”
“You’re right buddy.” Shaking his head vigorously, “This country is run by touts. It’s going to dogs for sure. There’s no place for decent folks like us” said Rao, who runs a very successful ‘tender servicing portal’ for government works that provides start to finish facilitation for its clients. And, he had assured my friend Hiraki a complete reversal of the process, of course, for a reasonable fee.

Disclaimer: The story is not a work of fiction and the characters are real and any resemblance to my golfing friends is purely intentional and not a coincidence.

Monday, July 2, 2012

పేరులో ఏముంది?

పార్టీ ఆఫీసు నిండా జనం. కానీ సందడి లేదు. తలలు వేలాడేసుకుని చిన్నచిన్న గుంపులలో గుసగుసలాదుతున్న పార్టీ నాయకులనీ, కార్యకర్తలనీ చూడగానే అప్పలనాయుడి గుండె జారిపోయింది.
ఇక లాభం లేదు ఎలక్షన్ నోటిఫికేషన్ అప్పటికే వెలువడింది. నాయకుడు శంకర్ బయటకి రావడానికి ఇదే ఆఖరి ప్రయత్నం. ఈ సుప్రీంకోర్టు బెంచీ గనుక అతడి విడుదలకి అంగీకరించకపోతే... ఇప్పుడిప్పుడే వేళ్ళూనుతున్న పార్టీకి గొడ్డలిపెట్టే! నాయకుడు లేని పార్టీ తలలేని కాయంలాంటిదే. అక్రమార్జన కేసులో నేరం నిరూపించబడింది. ఆపై వేసిన అపీలు హైకోర్టు తిరస్కరించింది. శిక్షాకాలం పదేళ్ళు ఖరారయింది. ఇప్పుడు సుప్రీమ్ కోర్టు కూడా అదేపని చేస్తే, ఇంకో పదేళ్ళవరకూ తమ నాయకుడు బయటికి వచ్చే ఆస్కారంలేదు. అంటే మరో పదేళ్ళవరకూ అతడు ముఖ్యమంత్రి పదవి చేబట్టే ప్రశక్తేలేదు. అంతేకాదు, ఎలెక్షన్ కమిషన్ నియమాల ప్రకారం, ఎన్నికల బరిలో దిగేందుకు ఎటువంటి వీలూలేదు.
పార్టీ ఆవిర్భావంనుంచీ వెంటనిలిచి, నియోజకవర్గంలో ఒక పట్టు సంపాదించాడు, అప్పలనాయుడు. టెలివిజన్ ఛానెల్స్ నిర్వహించిన సర్వేలు పార్టీకి రెండువందల పైచిలుకు సీట్లు రావచ్చని చెబుతున్నాయి. తమ నాయకుడే కనుక వెంట ఉంటే తన గెలుపు ఖరారే. శంకర్ అంటే ప్రజలలో విపరీతమైన ఆదరణ ఉంది. కానీ ఏంలాభం ... అతడే బరిలో లేకపోతే వోట్లు పడేటట్లా? పదిశాతం వోట్లు తగ్గినా, ఫలితాలు తలక్రిందులవుతాయ్. నియోజకవర్గపు కార్యకర్తలలో కూడా అదే బెదురు. శంకరన్నని ముఖ్యమంత్రిగా చూడాలనే ఆకాంక్ష అయితే ప్రజలలో ఉంది. కానీ అది సాధ్యంకాదని రూఢీ అయ్యాక, వేరే ప్రత్యమ్న్యాయం కోసం ఆలోచిస్తారేతప్ప పార్టీకి వోటేస్తారా?
ఇలా కొనసాగుతున్న ఆలోచనలలోంచి బయటపడుతూ, భుజంపైన చరిచినదెవరా ప్రక్కకి తిరిగి చూసాడు. "ఏం నాయుడుగారూ, ఏమన్నా ఖబర్ వచ్చిందా?" పైకి నవ్వుతూ పలకరించినా మస్తాన్భాయ్ ముఖంలో ఆందోళన ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మస్తాన్ గుంటూరుజిల్లా వాడు. టౌనులో మంచి పలుకుబడి ఉంది. గుంటూరు వన్ నియోజకవర్గానికి టికెట్టు దాదాపు అతనికే రావచ్చు.
"ఏమో? నేనూ ఇప్పుడే వస్తున్నాను. ఇవాళ ఉదయమే తెలిసింది. పలాసలో రైలెక్కి వైజాగు వచ్చి అక్కడనించి ఫ్లైటులో వచ్చాను."
"నేనూ అంతే. ప్రొద్దున్నే కార్లో బయల్దేరాను. దేనికో ఈ సమన్లు అంతుబట్టట్లే".
"బీ-ఫారమ్లకోసమే అయితే ఇంత హడావుడి అవసరం లేదు. చిన్నమ్మ ఏదో కొత్త ప్లాను ప్రకటిస్తారని క్రిష్ణారెడ్డి చెప్పాడు. పదండి లోపలికెళితే తెలుస్తుంది."
---
హాల్లో పెద్ద ప్లాస్మా టీవీ. అందరి దృష్ఠీ దానిమీదే. అది శంకరన్న స్వంత ఛానెల్. ఢిల్లీ నుండి నిమిషనిమిషానికీ అదే వార్త. అందరిలో ఒకటే ఉత్కంఠ. సుప్రీంకోర్టులో మూడురోజులుగా జరిగిన వాదనలు పూర్తయ్యాయి. ఇక అప్పీలు స్వీకరించేదీ లేనిదీ ఏ క్షణాన్నయినా ప్రకటించవచ్చు.
"నిన్నటిదాకా పరిస్థితి ఆశాజనకంగానే ఉండె. రాత్రికి రాత్రి ఏమయినాదో? లాయర్ మలానీ సిన్నమ్మని కలిసిండంట", గుసగుసలాడాడు క్రిష్ణారెడ్డి. క్రిష్ణారెడ్డి పార్టీలో సీనియర్ నేత. అప్పలనాయుడికి గురుతుల్యుడు.
"అంటే పరిస్థితి తారుమారైనట్లే కదా? జనంలో సానుభూతి ఉన్నమాట నిజమేగానీ, శంకరన్నే లేకపోతే..." తన అనుమానాన్ని వ్యక్తపరిచాడు అప్పలనాయుడు.
"ఏమీ భయంలేదప్పా. శంకర్ బాబు లేకుంటేనేం సిన్నమ్మ ఉండాదిగా"
"మీ సంగతి సరేనన్నా, మీ ప్రాంతంలో కాస్త మార్జిన్లు తగ్గినా గెలుపు గ్యారెంటీ. మా ఏరియాలో అన్నిచోట్లా త్రికోణపు పోటీలు. కాస్త అటూఇటూ అయినా..."
"అవును భాయ్. శంకర్ భాయ్ సీయెం అయేందుకు వీలుకాదంటే, కార్యకర్తలలో ఇప్పటికే నిరుత్సాహం కనపడ్తుంది. అది చాలు మనని దెబ్బకొట్టేందుకు", నసిగాడు మస్తాన్, తన గడ్డం సవరించుకుంటూ.
నిజమే! ఇటు అభ్యర్థులలో, అటు కార్యకర్తలలో ఎటు చూసినా నిరుత్సాహమే! అందునా ఈ సమయంలో... ఏంచేయాలో తోచక తలవిదిలిస్తూ వెనుదిరిగాడు, క్రిష్ణారెడ్డి.
"ఆహ్! క్రిష్ణారెడ్డీసాబ్, ఆప్ కేలియేహీ డూంఢ్ రహా హూ. ఒకసారి లోనికి వస్తారా?" అంటూ ఎదురొచ్చాడు, దేబాషిష్ పట్నాయక్.
---
దేబాషిష్ ఒక ప్రముఖ మార్కెట్ రిసెర్చి ఏజెన్సీలో మానేజరు. శంకర్ పార్టీకి సంబంధించిన సర్వేలూ, ఒపీనియన్ పోల్స్ ఆ సంస్థే నిర్వహిస్తుంది. ఎన్నికలముందు నియోజకవర్గాలలో, బూత్వారీగా పార్టీ అభ్యర్దుల బలాబలాలు బేరీజువేసుకునే కార్యంలో నిమగ్నమై ఉంది.
‘నో ఎంట్రీ - ప్రవేశంలేదు’ అని రెండుభాషలలో నోటీసులు అంటించి ఉన్న తలుపు  తోసుకొని లోనికి ప్రవేశించారిద్దరూ. కంప్యూటర్లూ, ప్రొజెక్టర్లూ, కాళీ అయిన కాఫీ కప్పులూ, సిగరెట్లతో నిండిపోయిన యాష్ట్రేలూ ... పెద్ద రౌండ్ టేబుల్ మీద అస్తవ్యస్తంగా పడి ఉన్నాయి. స్క్రీనువంక చూస్తూ ఒకరితోఒకరు వాగ్యుద్ధం చేస్తున్నవాళ్ళు, కంప్యూటర్లలో తలలు ముంచి తమపని తాము చేసుకుంటున్నవాళ్ళు, సోఫాలలో కాళ్ళుజాపుకుని కునికిపాట్లు పడుతున్న వాళ్ళు, తమలో తామే దీర్ఘంగా ఆలోచిస్తూ, అంతే దీర్ఘంగా పొగపీల్చి వదిలేవాళ్ళు - ఆడామగా అందరూ కలిసి పాతికమంది ఉండవచ్చు - లూజుగా వేళ్ళాడే టైలూ, మోచేతులదాకా మడిచిన షర్ట్ స్లీవులూ, గంజిపెట్టి ఇస్త్రీచేసిన ఖద్దరు చొక్కాలూ, జీన్సు ప్యాంట్లపై వెలిసిన టీషర్టులూ; ఇంగ్లీషూ, హిందీ, తెలుగూ - అన్ని భాషలూ కలిసిన రణగొణధ్వని.
"హలో క్రిష్ణారెడ్డీ సాబ్, వీయార్ వెయిటింగ్ ఫర్ యూ. ఇందాకే శంకర్ నుంచి ఫ్యాక్స్ వచ్చింది. ఒక పది నియోజకవర్గాలకి తప్ప అన్నింటికీ అభ్యర్ధులని ఖరారుచేసి, స్వహస్తాలతో వ్రాసి ఫ్యాక్సు చేసాడు. వీ నీడ్ యువర్ హెల్ప్", అని ఇంగ్లీషులో అంటూ, చేతిలోని తెల్లకాయితాల దొంతరతో ఎదురొచ్చాడు పిళ్ళే. అతడు రిటైర్డు డీజీపీ. పార్టీలోనూ బయటా శంకర్కి భీష్మాచార్యుడిలాంటి వాడు.
"వెరీగుడ్ సార్. ఏంచేయాలో చెప్పండి", ఎంత కప్పిబుచ్చుకోవాలన్నా, ఆ లిస్టులో ఎవరెవరి పేర్లున్నాయో తెలుసుకోవాలన్న ఆతృత క్రిష్ణారెడ్డి గొంతులో ధ్వనించింది.
"అమ్మాయ్ ఫోన్ చేసింది. ఢిల్లీలో పని పూర్తికాగానే బయలుదేరి అర్థరాత్రికల్లా వచ్చేస్తుంది. ఈలోగా..." అంటూ ఆగి ఒకసారి అటూఇటూ పరికించి, "మీతో ఒక పని ఉంది. పదండి అలా టెరేస్ మీదకెళ్ళి మాట్లాడుకుందాం", అంటూ వెనుక డోర్ వైపు దారితీసాడు.
---
"తెలుగువీరలేవరా...." అప్పలనాయుడి సెల్ ఫోన్ మోగసాగింది. చూస్తే క్రిష్ణారెడ్డి నుండి ఫోన్.
"హల్లో సార్"
"జాగ్రత్తగా వినప్పా, నాయుడూ ..."
రాత్రి పదింటికి తాజ్ హోటల్లో మీటింగు. చిన్నమ్మ ఢిల్లీనుండి వచ్చి అందరితో మాట్లాడుతుందట. అందరూ అంటే ఎవరు? అభ్యర్దుల లిస్టు ఖరారయిందా? ఎందుకింత రహస్యం? అంతవరకూ పార్టీ ఆఫీసు కూడా వదిలిపెట్టి, ఎవరినీ కలవకూడదూ, సంప్రదించకూడదని ఆదేశం! ఆలోచనలతో తలమునకలౌతూ, వెంట బయల్దేరిన కార్యకర్తలకి, అర్జెంటు పని ఉందని  చెప్పి వారించి, "పంజగుట్టకి పోనీయి" అంటూ కార్లో కూర్చున్నాడు. తన డ్రైవరూ, గన్ మ్యాన్ తప్ప ఇంకెవరూ లేరు.
టైముచూస్తే నాలుగున్నర. కనీసం నాలుగు గంటలు... ఒంటరిగా ఏంచేయాలి?
షాపింగ్?
ఎన్నాళ్ళయిందో? ఒంటరిగా షాపింగుకి వెళ్ళి. ఈ రాజకీయాల్లో చేరకముందు, ఎప్పుడు హైదరాబాదు వచ్చినా ఇంట్లో అందరికీ ఏదో ఒకటి కొనకుండా తిరిగివెళ్ళేవాడు కాదు. ఆ మహానాయకుడి పిలుపు అందుకొని రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన పోయాక రాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులు. శంకరన్న స్థాపించిన పార్టీలో ఎన్నో వడుదుడుకులూ, అభియోగాలూ ఎదుర్కుంటూ ఈ నాలుగేళ్ళూ అతని ప్రక్కనే నిలిచాడు. కుటుంబంతో కలిసి సరదాగా గడిపి ఎన్నాళ్ళయిందో! తన కూతురు ఇక్కడే హైదరాబాదులోనే హాస్టల్లో ఉండి మెడిసిన్ చదువుతుంది. ఇన్నిసార్లు హైదరాబాదు వచ్చినా దానిని కలిసిందేలేదు. ఫోన్ అందుకుని, డయల్ చేసాడు.
"హల్లో డ్యాడీ!" గొంతులో ఆశ్చర్యం ధ్వనించింది.
"ఏమ్మా బేబీ ఎలా ఉన్నావ్? పనిమీద వచ్చాను. ఒకటి రెండు గంటలు ఖాళీ దొరికింది. అలా వద్దామని అనుకుంటున్నాను."
"సారీ డ్యాడీ, నేనిప్పుడు హాస్టల్లో లేను. ఫ్రెండ్స్తో సిటీకి వచ్చాను"
"ఎక్కడున్నావ్?"
"పంజగుట్ట... సెంట్రల్"
"వెరీగుడ్. నీకూ నీ ఫ్రెండ్సుకీ అభ్యంతరం లేకపోతే అక్కడే కలుద్దాం. సరేనా?"
"గ్రేట్ డ్యాడీ... మేము ఇక్కడే మ్యక్డోనాల్డ్స్లో వెయిట్ చేస్తాం"
"ఓకే... పదిహేను నిమిషాల్లో అక్కడ ఉంటాను" అని ఫోన్ ప్రక్కనపెట్టి డ్రైవరుతో "హైదరాబాద్ సెంట్రల్ మాల్" అంటూ, సిగరెట్టు వెలిగించి, కార్ అద్దం కొంచెం దింపి బయటకి చూడసాగాడు. సిటీ ఎంత మారిపోయింది? ఇన్నేళ్ళగా వస్తున్నా ఎంతసేపూ పార్టీ ఆఫీసూ, హోటలూ, సెక్రటేరియట్టూ, శంకరన్న బంగళా తప్ప బయటకి వెళ్ళేదే తక్కువ అనుకుంటూ పొగవదలసాగాడు.
బేబీతో పాటూ ఇద్దరు ఫ్రెండ్స్. కాసేపు షాపింగంటూ మాల్ అంతా చుట్టి, మ్యక్డోనాల్డ్ బర్గర్లు తినడంతో సాయంకాలం ఆరయ్యింది. ఇంకా మూడు గంటలు. కూతురి సలహామీద పీవీఆర్ మల్టీప్లెక్సులో టికెట్లు కొనుక్కొని లోనికి వెళ్ళి కూర్చున్నాడు. ఏదో హిందీ సినిమా. సినిమా చూస్తున్నాడనే కానీ, ఆలోచనలన్నీ ఎన్నికలమీదే. సుప్రీంకోర్టు నిర్ణయం వ్యతిరేకంగా వచ్చింది. బేబీ ఫోన్లో ఆన్-లైన్లో చూసింది. హాల్లో ముళ్ళమీద కూర్చున్నట్లుంది. ఫోన్ సైలెంట్ మోడులో ఉంది... పాతికకి పైగా మిస్సుడ్ కాల్స్. ఎవరితోనూ మాట్లాడవద్దని కదా ఆదేశం.
ఇంటర్వెల్లో, కాలక్షేపం బఠానీలు అన్నట్లు, పాప్ కార్న్ క్యూలో నిలుచున్నాడు.
"ఎదురుగా ఇంకో ఖద్దరు చొక్కా.... "ఏంభాయ్ సినిమాకి వచ్చారా?" అడిగాడు మస్తాన్.
"ఆహ్ ఆహ్... మా బేబీ అడిగితే ఇలా తీసుకొచ్చాను" తడబడ్డాడు, అప్పలనాయుడు.
"మంచిపని చేసారు. పదింటికి కదా మీటింగు. అంతవరకూ టైంపాస్. మా బేగంతో సినిమాకెళ్ళి కూడా చాలారోజులైంది. ఇంతకీ ఏ సినిమాకి?"
"ఏదో సినిమా. ఇప్పుడు సినిమా చూసే మూడ్ కూడానా... అయినా మీటింగు ఎందుకో? అందులోనూ ఇంత రహస్యంగా...? ఎవరితో మాట్లాడవద్దని క్రిష్ణారెడ్డిగారు గట్టిగా చెప్పారు. మీక్కూడా ఫోన్ వచ్చిందా?" మస్తాన్ మీటింగ్ విషయం ప్రస్తావించడంతో అతని మనస్సులో ఉన్న అనుమానాలన్నీ ఒక్కసారిగా బయటపెట్టాడు, అప్పలనాయుడు.
"ఆల్మోస్టు అన్ని సీట్లూ నిర్ణయించినట్లే. ఫోను వచ్చిందంటే టికెట్టు ఖాయమే అనుకోండి నాయుడూ."
"ఏం టికెట్టో మస్తాన్ భాయ్. దానికి రెండువైపులా పదునే. శంకరన్న లేకుండా బరిలో దిగితే జనం వోటేస్తారో లేదో? ఇందాక పార్టీ ఆఫీసులో అందరూ అదే టాపిక్. శంకరన్న ముఖ్యమంత్రి అనికదా ఇప్పటిదాకా మన క్యాంపెయిన్. ఇప్పుడు అది సాధ్యం కాదంటే... ఏంచేస్తారో...?" అంటూ నాన్చాడు.
"నిజమే నాయుడుగారూ, సర్వే రిపోర్టులో కూడా కోస్తాలో పాతిక శాతం వోట్లు తగ్గే అవకాశం ఉందట."
"అంటే... మన ప్రొజెక్షన్లు అన్నీ తలక్రిందులే" ఇలా చర్చించుకుంటూ, సినిమా మళ్ళీ మొదలైన విషయమే మర్చిపోయారిద్దరూ. సినిమా పూర్తయి బయటకి వచ్చిన కుటుంబసభ్యులని వాళ్ళ దారిన పంపించి ఇద్దరూ ఒకే కార్లో తాజ్ హోటల్ చేరారు.
హోటల్ లాబీలో బయటా విపరీతమైన జనం. మీడియా కెమేరాలు. ఎలా వాసనపట్టారో?
"మీకు టికెట్టు ఇచ్చారా?" ప్రశ్నిస్తున్న టీవీ రిపోర్టర్.
"నో కామెంట్స్" అంటూ వాళ్ళని తోసుకుని ముందుకి వెళ్ళారిద్దరూ.
వాళ్ళ వెంట కెమేరాతో పరుగెడుతూ, న్యూస్ యాంకర్ని ఉద్దేశ్యించి, "తెక్కలి నియోజకవర్గం అప్పలనాయుడూ, గుంటూరు టౌన్ షేక్ మస్తాన్ వలీ ఇప్పుడే హోటల్లోకి ప్రవేశిస్తున్నారు సుష్మా, అంటే వీళ్ళిద్దరికి టికెట్టు ఖాయమయినట్లే. గుంటూరులో ముస్లీం అభ్యర్ధిని నిలబెట్టడంవల్ల అక్కడి ఇరవై శాతం ముస్లీం వోట్లమీద పార్టీ వలపన్నినట్లే భావించాలి. ఇక అప్పలనాయుడు, శ్రీకాకుళం జిల్లాలో వెనుకబడిన సామజికవర్గానికి చెందినవాడు. మొదటినుండీ పార్టీలో ముందుండి నడిపించినవాడు. అయితే... జిల్లాలో అంతమంది సీనియర్ నాయకులతో ఢీకొనే సత్తా ఈ యువనాయకునిలో ఉందా, అన్నదే ప్రశ్న. కెమేరామన్ మణితో రిపోర్టర్ ...."
మీటింగు క్రిస్టల్ హాల్లో. ప్రవేశించేముందు పకడ్బందీగా సెక్యూరిటీ. ఏదో బొంబాయి ఏజెన్సీ... "నో సెల్ఫోన్స్. నో బ్యాగ్స్... అన్నీ ఇక్కడే పెట్టి, లిస్టులో ఉన్నవాళ్ళే లోనికి వెళ్ళాలి"
---
అభ్యర్ధుల్లో ఎక్కువ శాతం యువకులే. అందరిలోనూ ఒకటే ఉత్కంఠ. అందరి మనసుల్లో ఒకటే ప్రశ్న. శంకరన్న లేకుండా ఎన్నికలు... ఎలా? నల్లేరు మీద బండి నడక అనుకున్న పార్టీ పరిస్థితి ఇప్పుడు తారుమారు అయ్యేట్లుంది.
చిన్నమ్మ ఢిల్లీలో బయల్దేరి రెండుగంటలైందట. ఏ క్షణంలోనైనా వచ్చేస్తుంది. శంకరన్న లేకుంటే ఇక పార్టీకి నాయకత్వం వహించేది ఎవరు? చిన్నమ్మా? ఆమెకి రాజకీయ అనుభవం ఏదీ? ఇంత స్వల్ప సమయంలో ఆమెని ముఖ్యమంత్రి అభ్యర్థిగా జనం స్వీకరిస్తారా?
"డోంట్ వర్రీ బ్రదర్. మేడం వచ్చాక మీకే తెలుస్తుంది. ఫెంటాస్టిక్ ప్లాన్" చిరునవ్వుతో పలకరించాడు, పదిమంది లాయర్ల మధ్య కూర్చొని ఏవో పేపర్లు తిరగేస్తూ వాళ్ళతో చర్చిస్తున్న దేబాషిష్ పట్నాయక్.
"ఏమో దేబూభాయ్, సుప్రీంకోర్ట్ నిర్ణయం తరువాత శంకర్జీ ఎన్నికలలో ఎలా పోటీ చేయడం?" బల్లపైన ఉన్న పేపర్ల వంక పరీక్షగా చూస్తూ, ఒరియాలో  అడిగాడు, అప్పలనాయుడు.
"చూస్తూ ఉండండి. ఒక నియోజక వర్గం ఏమిటి. అన్ని నియోజకవర్గాల్లో శంకర్ భాయ్ కాంటెస్ట్ చేస్తాడు" అని అర్థవంతంగా నవ్వాడు దేబాషిష్.
---
చిన్నమ్మ ప్రసంగం పూర్తయింది.
ఇంకా ఎవరూ షాక్ నుండి  తేరుకోలేదు. నిద్రలో నడిచినట్లు బయటకి అడుగులేసారు. వరుసగా టేబుల్స్, జిల్లాలవారీగా. ప్రతి టేబుల్కీ, ఒక నోటరీ. ప్రతి అభ్యర్థి పేరునా అఫిడవిట్లు రెడీగా ఉన్నాయి.
"రేపు ఉదయం పేపర్లో ప్రకటన వచ్చిన వేంటనే పని పూర్తయినట్లే. బీ ఫారంతో బాటూ, ఈ అఫిడవిట్ కాపీ, పేపర్ ప్రకటన కాపీ, జతచేస్తే చాలు. నామినేషన్ వేయడానికి..."
"ఎల్లుండి మంచిరోజు. మద్యాహ్నం పన్నెండూ ఇరవైకి ఒకేసారి రెండు వందల తొంభై శంకరన్నల నామినేషన్..."
"ప్రతి నియోజకవర్గం నుండీ శంకరన్నే పోటీ... ప్రత్యర్థులకి తలతిరిగిపోతుంది, అహహా"
"రేపు పేపర్లో ప్రత్యేకంగా ఐదు పేజీలలో అభ్యర్థుల లిస్టు ప్రకటించబోతున్నారు. రాష్ట్రంలో కనీవినీ ఎరుగని సంఘటన కాబోతుంది. ఇక పార్టీ గెలుపు గ్యారెంటీ..."
"రాష్ట్రంలో ప్రతి బ్యాలెట్ మిషన్ మీదా శంకరన్న పేరు!"
"ఒక శంకరన్నని ఆపితే, వందలకొలదీ శంకరన్నలు. వాట్ యాన్ ఐడియా, మేడం!" చిన్నమ్మ చుట్టూ మూగి ప్రశంసలతో ముంచెత్తారు సంతకాలు చేయడం పూర్తిచేసిన పార్టీ అభ్యర్థులు.
బ్ల్యాక్ ఇంక్ పెన్ను తీసుకొని ఎదురుగా ఉన్న స్టాంపు పేపర్ వంక చూసాడు, అప్పలనాయుడు.
‘బొబ్బిలి అప్పలనాయుడు, s/o అచ్చన్న నాయుడు అనే నేను ఈ దినం నుండీ నా పేరును శంకర్ బీ. ఏ. నాయుడుగా మార్చుకొనడమైనది’ అని దాని సారాంశం.
---


Sunday, June 24, 2012

మేడం - ఒక చిన్న కథ


మేడం నుంచి అర్జెంటుగా రమ్మని కబురొచ్చింది, ఏం ముంచుకొచ్చిందో? గబగబా లేసి ఛేంబర్లోని అద్దంలో ఒకసారి ముఖంచూసుకొని బయటకి అడుగులేసాడు గణేష్. డీసీపీ అడ్మినిస్ట్రేషన్, ఈ మిల్లెన్నియంలో ఫస్ట్ బ్యాచ్ ఐపీయెస్ ఆఫీసర్. పన్నెండేళ్ళ సర్వీసులో ఐదుసార్లు పోలీస్ మెడల్ సాధించిన యువ ఆఫీసర్. పోలీసోడంటే ఇలా ఉండాలి అని జనాల్లో పేరు సంపాదించాడు. ఇక మీడియా ఐతే సరేసరి, ఏదో ఒక విషయంలో అతడిని ఇంటర్వ్యూ చేయకపోతే టెలివిజన్ ఛానల్సుకి వారం గడవదు.
సెక్రెటేరియట్ చేరేసరికే బయట ఇరవైకి పైగా లాల్ బత్తీ కార్లు. ఇంకా మేడం కాన్వాయ్ ఐతే రాలేదు. హమ్మయ్య అనుకుంటూ తన స్కార్పియోలోంచి దిగి హడావుడిగా లోనికి పరిగెత్తాడు. "అర్జెంటుగా క్యాబినెట్ మీటింగటయ్యా, ఎందుకో తెలీదు. నిన్ను మాత్రం ఛేంబర్లో వెయిట్ చేయమన్నారు", అని పైకి అంటున్నా, నాకు తెలీకుండా ఈ ఆఫీసులో ఏదీ జరగదు అన్నట్లు అర్థవంతంగా చిరునవ్వు నవ్వుతూ బయటే ఎదురొచ్చాడు, నరసింహారావు. సీయెంలు ఎంతమంది మారినా అతడిని మాత్రం గత ఇరవై యేళ్ళగా సీయెం పేషీనుంచి ఎవరూ కదిలించలేదు. పేరుకి సీయేడీలో అస్సిస్టెంట్ సెక్రటరీయే కానీ, స్టేట్లో అతడు తెలియని ఆఫీసరే లేడు. ఇంకా నాలుగేళ్ళలో రిటైరవుతాడనగా ఐయ్యేయస్ కన్ఫర్ అయింది.
"ప్చ్... ఏమోసార్. నాకూ తెలీదు. ఇందాకే బంగళానుంచి ఫోను వచ్చింది, ఉన్నపళాన సెక్రటేరియట్కి రమ్మని... అంతే"
"ఏమోనయ్యా... ఇంతమంది సీయెంలని చూసానుకానీ, ఈ పిల్ల ఎప్పుడేం చేస్తుందో ఎవరికీ తెలీదు. వాళ్ళ నాయన నోట్లోంచి ఊడిపడింది", అని గుసగుసలాడుతూ, లోనికి దారితీసాడు, నరసింహారావ్.
"అంతేమరి... గతంలో ఏ ప్రభుత్వానికీ రాని మెజారిటీ. అపోజిషన్ అసలేలేదు, ఇక పార్టీలో ఆమె ఎదుట గొంతు ఎత్తే ధైర్యం ఎవరికీలేదు ... చూద్దాం ఏంచేస్తుందో"
"కరెక్టుగా చెప్పావ్. ఎవరి మాటా ఎలాగూ వినదు, మనం మాత్రం చేసేదేముంది?"
"ఇంతకీ నేను కాకుండా ఇంకెవరెవరున్నారో... మీటింగులో?"
"ఎవరు లేరూ! అందరూనూ... ఫుల్ క్యాబినెట్, అన్ని డిపార్టుమెంట్ల పీయెస్లూ, సీయెస్, మీ డీజీపీ .... అందరూ వచ్చారు. నిన్ను మాత్రం సపరేటుగా ఛేంబర్లో ఉంచమని మేడం ఇంస్ట్రక్షన్స్. అందుకే బయట నీకోసం వెయిట్ చేస్తున్నా. కాన్వాయ్ పది నిమిషాల క్రిందటే బయల్దేరింది. ఏ క్షణాన్నయినా రావచ్చు", అని గణేషుకి సీటు చూపించి గదిలోంచి నిష్క్రమించాడు, నరసింహారావ్.
---
ఎడమచేయి నిటారుగా పైకెత్తి మణికట్టు వద్దనుండి చెయ్యి ఊపుతూ లోనికి ప్రవేశించిన మేడం, అదే చేతితో అందరినీ కూర్చోమని సైగచేస్తూ తన కుర్చీ వైపు నడిచింది. ముందుగా హాలులో తన సీటు వెనుక గోడపై అమర్చిన తన తండ్రి నిలువెత్తు పటానికి నమస్కరించి, వెనుకనే అనుసరించి వచ్చిన గణేష్ని ప్రక్కనే నిలువమని సంజ్ఞచేసి ఆసీనులైన ప్రముఖులని ఉద్దేశ్యించి...
"మీకందరికీ తెలుసు, ఏడుకోట్ల ప్రజల ఆశీస్సులతో ఈ ప్రభుత్వం బాధ్యతలు చేబట్టి ఇవాళ్టికి సరిగ్గా నూరు రోజులయింది. ఆ ప్రజల ఆకాంక్ష నెరవేర్చేటికి కృషి చేసేందుకు మేము వేసే ప్రతి అడుగుకీ అంతరాయమే. మా నాయన ప్రవేశపెట్టిన ప్రతి పథకంలోనూ, గత ప్రభుత్వపు నిర్లక్ష్యం వల్ల అవినీతీ బంధుప్రీతీ పెరిగిపోయినాయ్. మీ రాజకీయ నాయకులకూ, ప్రభుత్వోద్యోగులకూ ప్రజోపయోగం మరిచిపోయి స్వంతలాభాలకు పనిచేయడం అలవాటైపోయింది. దానికి ఒకరిని అని లాభంలేదు. ఇది వ్యవస్థలో పేరుకుపోయిన కుళ్ళు. ఇది ఎంతలోతుగా చ్రొచ్చుకు పోయిందంటే, న్యాయవ్యవస్థ, సీబీఐలు కూడా దీనికి అతీతం కాదని గత కొన్ని సంవత్సరాలుగా జరిగిన సంఘటనలే ఉదాహరణ."
వింటున్నాడనేగానీ, గణేష్ చెవుల్లో ఇంకా ఛేంబర్లో మేడం చెప్పిన మాటలే రింగుమంటున్నాయి. ‘అది సాధ్యమా? ఇన్నాళ్ళుగా ఎవరూ చేయలేనిపని! తానొక్కడివల్ల సాధ్యమా? మేడం ఉద్దేశ్యం మంచిదే ... కానీ...’  అలా, అవిధంగా సాగుతున్న ఆలోచనల్లోంచి, తన పేరు వినపడగానే వాస్తవానికి వచ్చాడు.  
"ఈ అవినీతికి ఫులిస్టాప్ పెట్టాలంటే, అన్నింటికంటే పెద్ద అడ్డంకి ... ‘అయ్యో మనవాడే, పాపం వదిలేయండి’ అని వెన్నుకాసే పెద్దలే. ముందు ఈ వ్యవస్థలోని నెపోటిజమ్ అనే వేరుపురుగుని నాశనంచేస్తే కానీ, ఈ అవినీతి అనే వ్యాధినుంచి వ్యవస్థను ప్రక్షాళణ చేయలేము. రాష్ట్రాన్ని ప్రగతివైపు నడిపించాలనే ఆ మహానాయకుని ఆకాంక్షని పూర్తి చేయలేం. అందుకని, ఎంతో ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చే మిమ్మల్నందరినీ ఇక్కడికి పిలిపించాను. ఈ కార్యానికి సారథ్యం వహించడానికి, ఒక మచ్చలేని అధికారి అవసరం ఉంది. అందుకే, ఎన్నో సర్వీస్ రికార్డులని శోధించిన తరువాత, యువకుడూ, ఈ కార్యభారాన్ని నిర్వహించడానికి అన్ని అర్హతలూ కలిగిన పోలీస్ అధికారిని ఎంపికచేయడం జరిగింది. ఇప్పుడు శ్రీ గణేష్ ఐపీయెస్, ఆ పథకాన్ని క్లుప్తంగా వివరిస్తారు", అని అతడి వైపు తిరిగి చిరునవ్వు నవ్వింది మేడం.
పథకమా? అని ఒక క్షణం నెవ్వెరపోయిన మాట వాస్తవమే. ఛేంబర్లో మేడం చెప్పిన విషయాలని కార్యరూపంలో పెట్టాలంటే కనీసం ఆరునెలలు పట్టవచ్చు. ముందుగా ఒక బ్లూప్రింటు తయారుచేయడానికే కొన్ని వారాలు పట్టవచ్చు. మేడం ఉద్దేశ్యం తెలిపి ఇంకా అరగంట కూడా కాలేదు, ఇంతలోనే ఇంతమంది పెద్దలకు, పథకాన్ని వివరించాలా? ఎలా? కర్చీఫుతో ముఖం తుడుచుకొని ఏమైతే అయిందని ముందడుగు వేసాడు, గణేష్.
"లేడీస్ అండ్ జెంటిల్మెన్, గౌరవనీయులైన మేడంగారి నిర్ణయం తెలిసి కొన్ని నిమిషాలే అయింది. వారి ఉద్దేశ్యం అత్యంత శ్లాఘనీయం. కొన్ని శతాబ్దాలుగా పేరుకుపోయిన అవినీతి అనే ఈ కుళ్ళును అంత త్వరగా నిర్మూలించడం సాధ్యమా? నిజమే ... ఆ అనుమానం నాకూ వచ్చిన మాట వాస్తవమే. కానీ ప్రయత్నించడంలో తప్పులేదు. అదేదో తూతూమంత్రంగా కాకుండా ఒక పథకం ప్రకారం ముందుకు సాగాలి. వారి ఉద్దేశ్యం ప్రకారం ఈ కార్యసాధనకి ఒక క్రొత్త ఆంబుడ్స్మన్ వ్యవస్థని రూపొందించవలసిందని ఆదేశించారు. అది ఆ దివంగత మహానేత పేరున జిల్లాలవారీగా ఎంపికచేసిన కార్యదక్షులైన యువకులతో కూడిన ఒక ఫోర్సు. జిల్లాకి పదిమంది చొప్పున రెండువందలయాభై మంది, రాజధానిలో మరో ఇరవైమంది. వీరుగాక ఈ ఫోర్సుకి నాయకునిగా అవినీతికీ, బంధుప్రీతికీ అతీతుడైన ఒక అధికారిని నియమించడం జరుగుతుంది. ఈ ఫోర్సు నియామకాలలో ఎటువంటి బంధుప్రీతికీ తావు ఉండరాదని మేడం ఉద్దేశ్యం. ఆ బాధ్యతను నిర్వహించే విషయంలో ముఖ్యమంత్రి కార్యాలయంలోని శ్రీ నరసింహారావుగారు నాకు సహకరిస్తారు. అర్హులైన సాంఘిక దృక్పథం కలిగిన యువకులను ఇంటర్వ్యూ చేసి వారి నియామకాల్ని వచ్చే మూడునెలల్లో పూర్తిచేయడమే కాక ఆ ఫోర్సు నాయకుని నియామకం విషయంలో కూడా ఒక షార్ట్ లిస్ట్ సిద్ధంచేయాలని నన్ను ఆదేశించారు. ఒకసారి నాయకుడిని నిర్ధారించాక ఇక ఈ ఫోర్సుతో నాకు కూడా ఎటువంటి ప్రమేయమూ ఉండదు. పూర్తి స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉండాలంటే అదోక్కటే దారి. ఆ ఫోర్సుయొక్క అధికారాలను నిర్దేశించే బ్లూ ప్రింటు ఇంకో పదిరోజుల్లో మేడంకి సమర్పించబోతున్నాను...."
"దాని ఆధారంగా కావలసిన ఎక్సిక్యుటివ్ ఆర్డర్సు, ఈ క్యాబినెట్ అనుమతితో సిద్ధంచేసి ప్రచురించడమే మన తదుపరి కార్యక్రమం", అంటూ తన మాటలకి అడ్డువచ్చింది, మేడం.
---
పత్రికలో ప్రకటనలకి అప్లికేషన్లు లక్షలకొలదీ వచ్చిపడ్డాయి. టాటా ఇంస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ప్రొఫెసర్లతో కూడిన ప్యానెల్ ద్వారా నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులైన యువతీయువకులను జిల్లాలవారీగా ఇంటర్వ్యూలు చేసి ఫైనల్ లిస్టుని సిద్ధంచేయడంలో రెండునెలలు క్షణం తీరికలేకుండా గడిచిపోయాయి. ఐతేనేం? ఆ పని గణేష్కి ఎంతో తృప్తిని ఇచ్చింది. ఇక నాయకుని నియామకానికి క్యాండిడేట్ల లిస్టు తయారుచేయడమే మిగిలింది.
"మీరు ఇచ్చిన లిస్టులో అందరూ ఈ బాధ్యతకి అర్హులే. వీళ్ళలో ఐదుగురిని మాత్రమే ఎంపికచేసి మేడంకి సమర్పించాలి", అంటూ నరసింహారావు ఇచ్చిన పన్నెండు మంది లిస్టుని దీక్షగా పరిశీలించసాగాడు గణేష్.
"వీరందరూ తమతమ ఉద్యోగాలను వదిలి ఐదేళ్ళు డిప్యుటేషన్ మీద ఈ బాధ్యతని స్వీకరించేందుకు అంగీకరించారు. ఇందులో నలుగురు ఐయ్యేయస్, ముగ్గురు ఐపీయెస్, ఇద్దరు జడ్జీలు, ఇక మిగిలిన వాళ్ళు, ఫారెస్ట్, ఎడ్యుకేషన్, మైన్స్ అండ్ జియాలజీ డిపార్టుమెంట్లలో అధికార్లు. వీళ్ళలో ఐదుగురిని ఎంపిక చేయడం నీకే వదిలేస్తున్నాను. వారంలోగా లిస్టు మేడంకి సబ్మిట్ చేయాలి, నీ యిష్టం", అంటూ కుర్చీలో జారగిల పడ్డాడు, నరసింహారావ్.
"సింపుల్ సార్ ... వీళ్ళ కాన్ఫిడెంషియల్ ఫైల్సుతోబాటూ వీరి వీరి ఫ్యామిలీ హిస్టరీ సిద్ధం చేయండి. ఎవరి బంధువర్గంలో రాజకీయనాయకులూ, ప్రభుత్వాధికార్లూ లేరో ఆ ఐదుగురినీ మేడంకి ఇద్దాం. ఆమె చెప్పినట్లు బంధుప్రీతికి ఎటువంటి తావూ ఉండదు", అంటూ నరసింహారావు వంక చూసాడు.
ఆ క్షణంలో అతడి ముఖంలో తొంగిచూసిన చిరునవ్వులోని అంతరార్థం మాత్రం గణేష్కి గోచరించలేదు.
---
"వెల్ డన్ మిస్టర్ గణేష్. ఇంతకొద్ది కాలంలో మీరు సాధించినది అసామాన్యం. వీయార్ ప్రౌడ్ ఆఫ్ యూ. ప్రతి జిల్లాలో, ప్రతి మీడియాలో ఇదే విషయం. దేశమంతా దీని గురించే చర్చ. ఎక్సెలెంట్!" మేడం ఛేంబర్లో ఆమెతో నరసింహారావూ, అతడూ తప్ప వేరెవ్వరూ లేరు.
"థాంక్యూ మేడం. మీరు ఆదేశించిన విధంగా ఎటువంటి వత్తిడికీ లొంగకుండా, పని పూర్తిచేసాం. ఇక నాయకుని ఎంపిక మాత్రమే మిగిలింది" అని నరసింహారావు వంక తిరిగి చిరునవ్వు నవ్వి చేతిలోని కాన్ఫిడెంషియల్ ఫైలు ఆమె చేతికందించాడు, గణేష్. అతడి ముఖం వేయి విద్యుద్దీపాల కాంతితో వెలిగిపోతుంది.
"గుడ్ వర్క్, గుడ్ వర్క్" అంటూ అతడి చేతిలోని ఫైల్ అందుకొని, "వచ్చేనెల నాయన వర్ధంతికి, ఈ నాయకుని నియామకం న్యాషనల్ మీడియాలో ప్రకటించాల", అంటూ ఫిలులోని ఒకేఒక పేజీ వంక దృష్టిసారించింది, మేడం.
లిస్టులో పేర్లు చదువుతున్న మేడం ముఖంలో రంగులు మారసాగాయి. ఎర్రబడిన కళ్ళతో నరసింహారావు వంక చూస్తూ, "ఏమప్పా, నీవన్నా చెప్పేపండ్లా? ఇంతకాలం ఈడనే ఉండావ్ కదా? ఇంత ఎక్స్పీరియెంస్ ఏటికి? కాల్చేటికా? ఇందులో నా బావమరిది పేరేదీ?" అంటూ ఫైలుని గణేష్ ముఖం మీదికి విసిరింది, మేడం.
---

Wednesday, December 7, 2011

Do we have the moral right to claim credit for championing Buddhism?


A certain amount of jingoism is alright. 

Recent history or economic competitiveness justifies our eagerness to rise to the defense of our motherland, laudable. But… do we ever introspect before jumping to claim moral high-ground?  

There is no denying the fact that Buddha lived here or that we have not forgotten his principal teachings. The Hindu religious beliefs and practices today have more in common with his teachings than the Brahmanic religion which had preexisted. No wonder, the founder of the six branches of latter Hinduism, Sankara, was called Pracchanna Buddha (Buddha in disguise). 

When the Tibetan theocracy had a crisis we had immediately embraced them. Was it an entirely altruistic act? Or had it sprung from our love for the religion which had disappeared from this country a millennium ago? Yes, we may say it’s neither. It was a simple act of a good neighbor. Great!

That act alone holds us in good stead today and, gives us a reason to boast. 

While we are blowing the trumpets about the Global Buddhist Congregation at New Delhi, shouldn’t our attention be drawn towards some of our failings too? Here, I’m not talking about the abuse and persecution we had meted out when the teachings of Buddha became no longer fashionable or feasible in an environment of war, political fragmentation and general unrest which characterized the medieval times. It was not only here. Across a large swathe of Central and Western Asia the socio-political compulsions had dictated that we adopt violent, sectarian faiths. It’s a historic truth. And, any burden of guilt, if you carry, its fine; but any compulsion is unreasonable. Luckily, Buddhism had survived, where geography allowed isolation.

Asokan Inscription at Sannati
But… with the coming of modern age, when the likes of Cunningham and Marshall exposed our collective consciousness to that phase in history, in which the people of this country, our ancestors, nurtured and propagated a tradition which was systematically erased in later times; we had recognized a prize, a crutch for our wounded self esteem. We had grabbed at it with both hands to prop up our immediate agenda – no doubt symbolically – to validate our secular and egalitarian credentials.

We had drawn what we needed. Period 

If you say that… 
‘with knowledge must come, responsibility’; 
and now that we know that our country has the custody of a heritage,
Shouldn't we be accountable to the millions of people who cherish it?  

We just provide lip service and nothing tangible. Of course, the sites and monuments associated with the faith give an opportunity for the enterprising amongst us, to wangle an extra dollar or yen from the faithful. Alright, but where it is not allowed by law, the political and administrative apathy is amply evident.

Portrait of King Asoka (ranyo asoka inscribed on top)
Examples? There are many. 
 

One that comes to mind is Kanaganahalli or Sannati, a Buddhist site discovered in 1993-94. 

It is a short distance from Yadgir, a district headquarter town in Karnataka. 
Trial excavations by archaeologists took place over a couple of seasons and were completed in 1996-97, exposing a wealth of material - architectural, sculptural and thousands of written words. 


Fourteen years! 

Still the report is awaited. Will it ever see the light? 
Buddha alone knows! 
While the various agencies involved are busy fighting turf wars, the site and the sculptures lay exposed to the elements.

Among the sculptural material is a carved limestone slab. Portrait off a king called Asoka. You may ask, ‘how in Buddha’s name do you know?’ Let me show you. Do you see the scribble on top of the picture?  They are letters in Brahmi, the original Indian script. His name ‘Ranyo Asoka’ was inscribed at the top of his portrait to squelch your doubts. 

And, it’s the only such specimen.

It is laid out under a Neem tree.

There he rests; the greatest ruler of the Indian Subcontinent, whose contributions to the Buddhist faith are matched only by its founder Gautama Buddha himself and probably by the philosopher, Nagarjuna. 
 
Sannati is only one such example. 

When I visited the site, 

The shade provided by the Neem tree was the only convenient place for a half a dozen security men to have their lunch. Poor souls! where else will they go to? Haven't we read in our history text books, that there was a king called Asoka, who had planted trees to provide shade to the common folk? 
Now, he shares the shade still!
And, the stone portrait of the king also served as their dining table. 

 
Shame!?
 

Monday, December 5, 2011

వాశిష్ఠీదేవి పరిచయం

 
పవిత్ర గోదావరీ నదీతీరం. పడమటి కనుమల్లో నాసికా నగరివద్ద పుట్టి ఆంధ్రమహరాట్టులసీమలను సస్యశ్యామలంచేస్తూ తూర్పుకనుమలతో దోబూచులాడుతూ దక్షిణారామానికి దిగువగా ప్రాగ్సాగరంలో కలిసే మహానది. ఒక్క పవిత్రస్నానంతోనే సకల పాపాలూ హరించగల పుణ్యనది. అది ప్రతి పన్నెండేళ్ళకూ ఒకసారి వచ్చే మహా పర్వదినం. ఆనాడు ఆ నదీమతల్లి జలాల్లో మునకవేయని దౌర్భాగ్యుడు ఆ ప్రదేశంలోనే ఉండదు. నేలయీనినట్లు జనం. నదీతీరంలో అమ్మవారి కోవెల. ఆమె బ్రాహ్మణులకు బ్రహ్మాణి, వైదికులకు విద్యాదాయియైన సరస్వతి, ద్రావిడులకు ఇలాదేవి, మరియూ సామాన్య జానపదులకు బొడ్డెమ్మతల్లి. ఇక బౌద్ధధర్మాన్ని ఆచారించేవారికి బుద్ధిస్వరూపిణి ప్రజ్నాపారమిత. మహాత్వ కవిత్వ పటుత్వ సంపదలిచ్చే కల్పవల్లి. 
ఉచ్చైశ్రవాలవంటి పంచకల్యాణులపై సైనికులు దారిచూపగా, మణిమయ చత్ర చామరాలతో రాచభటులు ముందురాగా, భేరీ నాదస్వరాలకి అనువుగా వేశ్యారమణీ సమూహం నృత్యగీతాలు ఆలపించగా, రక్షకబృందం, పరివారం చుట్టూ నడవగా, రాజమాత గౌతమీదేవియొక్క రాచపల్లకీ దేవి ఆలయం ముందు వచ్చి నిలిచింది.
ఐరావతపు దంతములవన్నె వెలినూలు చీరె, కావిరంగు కాశ్మీరపు ఉన్ని పైబట్టతో ఆభరణరహితయై దైవమాత అదితీదేవిలా పల్లకిదిగిన రాజమాత గౌతమీదేవిని చూసిన మరుక్షణం జయధ్వానాలు మిన్నంటాయి.
శాతవాహన సామ్రాజ్య క్షేమదాయీ... జయః
శ్రీశాతకర్ణీ వరపుత్ర దాయిత హిరణ్యగర్భీ... జయః
ఆంధ్ర కర్ణాట జన కల్యాణకారిణీ... జయః
అపరిమిత ధన ధాన్య దాన ప్రదాయినీ... జయః
రాజమాత దర్శనార్థం విరగబడ్డ జనాన్ని అదుపుజేయడం ఒక మహాయజ్నమే!
అంతలో...
అదే పల్లకీనుండి,
మహాచీనంలో ప్రత్యేకించి నేయించిన నాజూకు నాచుపచ్చ హోంబట్టుపై, కాంచీపురపు బంగారు బుటాతో మామిడిపిందెల అంచు చీరె, చాటున దోబూచులాడే లేత కుచాగ్రాలను దాచే వ్యర్ధప్రయత్నం చేస్తున్న కుంకుమరంగు మహాలంక రవపట్టపు రవికె, దానిపై ఆరుపేర్ల సువర్ణ పణహారం, శంఖాన్ని పోలిన మెడచుట్టూ రవ్వల కంఠాభరణం, వసంతర్తాగమనం తెలియజేసే మొదటి మామిడి పిందెవంటి చుబుకంపై మూడు చుక్కల పచ్చబోట్టు, సంకర్షణుని హలాగ్రంలా కోటేరేసిన నాసాగ్రంపై మంచిముత్యపు నత్త్తు, బెత్తెడు జారిన జంట సంపెగలవంటి చెవులపై ఉయ్యాలలూగే కుండలాలు, మహాసాగరమువలె సమస్త భూమండలాన్నీ తమలోతుల్లో దాచగల కాటుకదిద్దిన కళ్ళు, భ్రూమధ్యంలో ఎర్రని దోసపిందె బొట్టు, విశాలమైన పాపిట పచ్చల రావిరేకు, తుమ్మెద రెక్కలను తలదన్నే కచసంపదను ముత్యాల సరాలతోనూ సన్నని కనకాంబరాలతోనూ పేనిన బారెడు జడ, ఎడమ భుజంపై పడగెత్తి నునువైన చామనఛాయ దండను చుట్టిన వాసుకీబంధపు వెండి వంకీ, ముంజేయి నుండి మోచేతి వరకూ తీర్చిన రత్నమయమైన కంకణాల బరువుకు వణికే పల్లవ కోమలములైన బాహువులు, అర్ధచంద్రమను బోలిన నాభిని తనలో దాచిన ఆకాశము వంటి నడుముకు వెండి గంటలు కూర్చిన కెంపుల వడ్డాణ్ణం, కస్తూరికాది పాదలేపనాలతో మిశ్రితమైన లత్తుకతో అరుణకాంతులు వెదజల్లే పాదద్వయం.... రత్న మంజూషపై అవి మోపినప్పుడు చేసిన మణికింకిణుల కణక్కణనాదాలకు నిశ్చేష్టులైన జనానికి, ఆ అసమాన సౌందర్యరాశి, ఆ అలౌకిక లావణ్యమణీ ఎవరో ఊహకందలేదు...
’ఈమె మానవ సుందరి కాదు దేవలోకంనుండి వచ్చిన ఇంద్రాణి కాబోలు!’
’లేక నాగలోకంనుండి వచ్చిన ఉలూచీ దేవియా?’
’లేదు, ఈ మచ్చెకంటి, సాగరగర్భాన ఉదయించిన లక్ష్మీదేవియే!’
’పీతవర్ణపు చీరెలో వసంతుని సహోదరి, కామునికై వచ్చిన రతీదేవేమో?’
ఇలా తమలోతమే ఊహించుకుంటూ చేష్టలుడిగిన జనానికి కంచుకి హెచ్చరికతో తెలివివచ్చింది.
’వినండహో..... విశాఖనాగడుదొర మగ, కళింగ రట్టోడి కూతు, సాతకన్ని మారాజు కాబోయే ఇల్లాలు, తెన్గుకన్నడ సీమకి దేవుళ్ళిచిన దొరసాని, సాతవానికుల మారాణి, సిరితాయి వాసిఠ్ఠీయమ్మ మారాజుని మనువాడ పైథానపూరి దారి మనసీమకొచ్చె. బిరాన మొక్కుడీ’ అన్నంతనే జనంలో కలిగిన కలకలం అతింత కాదు.

Thursday, November 24, 2011

శ్రీరామజ్వరం

గత పాతికేళ్ళుగా తెలుగులో పౌరాణిక సినిమా వచ్చినట్లు గుర్తులేదు.

బాపూ సినిమా! 
సినిమా రిలీసయింది అని తెలియగానే..... సినిమా ఫీవర్ పట్టుకుంది.

ఎక్కడ ఆడుతుందో అని పేపర్లో చూసాను. ఇంటికి దగ్గరగా ఒకటే మల్టీప్లెక్స్, ఫేమ్ లిడో, బెంగుళూరు ఎమ్ జీ రోడ్డు దగ్గర. వెళ్దామంటే రెండు రోజులు తీరిక లేకపోయింది.


ఆలస్యం అయ్యే కొలదీ జ్వరం తీవ్రమైంది. 

తోడుగా రమ్మంటే ఎవరికీ ఆసక్తి లేదు. భార్య బంగారాన్ని పిలిస్తే, పౌరాణికాలు తనకు గిట్టవని తెగేసి చెప్పేసింది. ఇక బంగారు సీతలెవరినైనా పిలిస్తే వచ్చి ఉండేవాళ్ళేమో? కానీ ఏకపత్నీవ్రతుడి సినిమా కదా, బాగుండదేమో ;)
ఉదయాన్నే లేచి, ఐదు గంటలు గాల్ఫ్ కోర్సులో వృక్షాలూ, పక్షుల మధ్య వనవాసం చేసి, స్నానాదులు, అంటే బ్రేక్ఫాస్టూ కాఫీ లాంటివి అనమాట, ముగించి, ఒంటిగంటకు ఒంటరిగా సినిమా హాలుకి చేరాను. సినిమా ఒకటీ నలభైకి. బాక్సాఫీసులో టికెట్లిచ్చే పిల్ల, "చిన్న ప్రాబ్లం సార్" అని టికెట్ ఇవ్వడానికి నిరాకరించింది. ఏదో టెక్నికల్ ప్రాబ్లమేమో అనుకుంటూ...
"కారు పార్కింగులో పెట్టి వచ్చేదా? షో అయితే ఉంది కదా?" అని అడిగాను.
"అదే ప్రాబ్లం సార్. మీరే చూడండి. బుకింగులు సున్నా! సేల్సు సున్నా! ఈ షో కి వచ్చిన ఒకే ఒక వ్యక్తి మీరే. కనీసం ఆరుగురైనా లేకపోతే సినిమా వెయ్యడం సాధ్యంకాదు. కాసేపు ఆగండి, ఇంకెవరైనా ఐదుగురు వస్తే టికెట్లు ఇస్ష్యూ చెస్తాను", అన్నది.
సరే ఇంకేం చేస్తాం? సిగరెట్టు వెలిగించి రామభజన చేస్తూ బాక్సాఫీసు బయట కూర్చున్నాను. అంతలో కోరిన వరాలిచ్చే వనదేవతల్లా అలంకరించుకొని, శబరిమాతలాంటి వృద్ధురాలికి తోడుగా ఇద్దరు స్త్రీలు వచ్చారు. వాళ్ళకి విషయం చెప్పి, "ఇంకో ఇద్దరన్నా కావాలి, మీఇంట్లో వాళ్ళు కానీ, చుట్టాలో ఫ్రెండ్సో వస్తారేమో ప్రయత్నించ" మని బతిమాలాను. పాపం ఫోన్లో చాలమందినే అడిగిందామె. ఫలితం లేదు.
ఈలోగా ప్రక్కనే కూర్చొని తన గర్ల్ ఫ్రెండు కోసం వేచిచూస్తున్న ఒక బెంగాలీ యువకుడితో మాటకలిపాను. ఏ సినిమా అనేదీ అతను ఇంకా నిర్ణయించుకోలేదు. అదీ మనమంచికే. "చూడు బాబూ, ఈ సినిమా అయితే హాల్లో మేము నలుగురం తప్ప ఇంకెవరూ ఉండరు. మేమూ వెనక్కి తిరిగి చూడం. సినిమా మీకు అర్థంకాదు కాబట్టి, ఎటువంటి డిస్టర్బెన్సూ ఉండదు. నీవూ నీ గర్ల్ ఫ్రెండూ కనుక టికెట్ తీసుకుంటే, అంతా కలిసి ఆరుగురు అవుతాం".
నా అదృష్టానికి ఆ అబ్బాయి "సై" అన్నాడు.
ఆవిధంగా హాలులోకి ప్రవేశించి ముందు సీట్లో కూర్చున్నాను.
హాలు గోడలు చూస్తుంటే అదొక ’డెజావూ’ లా అనిపించింది. ముప్పై ఐదు ఏళ్ళ క్రితం, తిరుపతి. అదీ బాపూ సినిమాయే! సీతాకళ్యాణం. తిరుపతిలో నా అదృష్టం కొలదీ I. S. మహల్ సినిమాహాలు ఓనరు పాపం ఆ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కొనుక్కున్నాడట. ఆ ఒక్క ఊళ్ళోనే ఆ సినిమా నెలరోజులకు పైగా ఆడింది. సెలవలకి తిరుపతిలో ఉన్నానేమో, రోజూ రెండోఆటకి సువేగా మోపెడ్ వేసుకోని నేను రెడీ. ఒక్కరోజు కూడా విడువకుండా కనీసం ఇరవై సార్లన్నా చూసి ఉంటాను. చాలా సార్లు మొత్తం హాల్లో నేను ఒక్కడినే.

ఈ ముప్పై సంవత్సరాలలో, ఆ సినిమా కనీసం వందసార్లన్నా చూసాను. ఇక ఈ రామరాజ్యం ఎన్నిమార్లు చూస్తానో?


అనుకున్నట్లుగానే, త్యాగయ్య పదాలలో శ్రీ రామ పురప్రవేశంతో సినిమా మొదలయింది.
అద్భుతం!
అప్పుడు నోరు తెరిస్తే, సినిమా అయ్యేవరకూ మూతబడలేదు. ఏవో ఒకటి రెండు క్షణాలు తప్ప ఎక్కడా అపశృతి లేదు.

ఎన్టీయార్ కొడుకు రాముడు? పర్వాలేదు. తెలుగు సరిగ్గా ఉచ్చరించడం రాకపోయినా విగ్రహం బాగానే ఉంటుంది. కథలో రాముడు కూడా నవయువకుడు కాదుకదా, కాస్త పెద్దతరహా పాత్రే. ముఖంమీద ముడతలూ, కళ్ళకింద సంచులూ కనిపించినా అంత అనౌచిత్యంగా అనిపించలేదు. ఇక కౌసల్య పాత్రలో కే ఆర్ విజయ. మరీ వయస్సు ఎక్కువైపోయింది. కొంచెం మధ్య వయస్కురాలెవరైనా అయితే బాగుండేదేమో? అదే విధంగా, వశిష్ఠుడిగా బాలయ్య (హీరో బాలయ్య కాదు) మరీ వృద్ధుడై పోయాడేమో, మాటలు సరిగ్గా పలకలేక పోయాడు. వైయ్యాకరణి, సాధువూ, పురోహితుడిగా సరిపోలేదనిపించింది. ఇక అయోధ్యా పురజనుల రూపురేఖలు బాపూ సినిమాకి తగినట్లు లేవు. జూనియర్ ఆర్టిస్ట్ గిల్డ్ ప్రభావమేమో? ముందు వరసలోని పురజనం విషయంలోనైనా కాస్త జాగ్రత్త తీసుకొని ఉండవలసింది. ఉదాహరణగా, సీతాకళ్యాణంలో, రాముడు మిథిలా నగరం ప్రవేశించినప్పటి సన్నివేశంలోని జనాన్ని, ఈ సినిమాలో లవకుశులు అయోధ్యా నగరంలో పాడుతున్నప్పటి సీన్ తో పోల్చిచూస్తే తెలుస్తుంది.

ఐతే, మిగిలిన వాళ్ళంతా పాత్రలకి అతికినట్లు సరిపోయారు: సీతా, లక్ష్మణుడు, పిల్లలు - లవకుశులు. ఎప్పుడో నలభై ఏళ్ళ క్రిందటి, మహాబలిపురపు బాలరాజుకి, హనుమంతుణ్ణి సంధించి చేసిన ప్రయోగం అద్భుతంగా ఉంది. వృద్ధ వాల్మీకిగా, కథకు సూత్రధారుడిగా ఇంకో బాలరాజు, మహా 'ఋషి' నాగేశ్వరరావు. రాముడి కథ చెప్పడం వారికి ఎప్పటినించో అలవాటే. భూకైలాస్ లో నారదుడిగా మొదలుపెట్టారు. అందాలరాముడుగా, భధ్రాచల స్థలపురాణం ఆయనతో బాపూ రమణలే కదా చెప్పించారు? 

దృశ్యకళ అసమానంగా ఉంది. అయోధ్య రాచనగరి మధ్యయుగపు భారతీయ శిల్పకళా సంస్కృతికి అద్దం పట్టినట్లు ఉంది. ద్వారసముద్రపు (హళేబీడు) గోడలూ, అర్భుదనగపు (మౌంట్ అబూ) జినాలయాల స్థంభాలూ, కాకతీయ తోరణాలూ అన్నీ ఒకేచోట! నయనానందకరం.

ఇక చిత్రకల్పన, సంగీతం విషయం చెప్పడం అనవసరం. అది బాపు బొమ్మ. జగదానందకారకం. పుష్పకంలో సీతారాముల్ని చూసినప్పుడు మొదలైన ఉద్వేగపు కన్నీళ్ళు వైకుంఠారోహణం వరకూ కారుతూనే ఉన్నాయి. దానికి తోడు కథ మొదటి సగం కరుణరస ప్రధానం. రెండు చేతిగుడ్డలు పూర్తిగా తడిచిపోయాయి.

ఈ జ్వరం ఇప్పట్లో తగ్గేటట్లు కనిపించడంలేదు.
ఔషధం, రామరసమే!
వైద్యుడు బాపూ.
దీర్ఘమైన చికిత్స - సినిమాహాలు ఇంజెక్షన్ల తర్వాత, డీవీడీ మాత్రలతో చాలారోజులే అవసరం!
ఇక చివర్లో, రాముడు, సోదర సహితుడై చేసిన మహాభినిష్క్రమణంకి బదులు ఒంటరిగా ఏడు వాకిళ్ళు దాటటం కొంచెం నిరుత్సాహపర్చింది. 
అయితేనేం? 
కావ్య ఫలశృతులే నిజమైతే, ఈ దృశ్య కావ్యాన్ని చూసిన వాళ్ళందరూ ఆ ఏడు తోరణాలూ దాటి ఆ వైకుంఠునిలో ఐక్యం కాగలరు.
రమణ గారు సినిమా చూసి ఉంటే ఎంత ఆనందించేవారో?